BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

తెలంగాణ
16 Jan, 2026 - 08:58 AM
278 వీక్షణలు

14వ ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

— బట్టుపల్లి అనురాధ, ఐద్వా జిల్లా కార్యదర్శి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ, 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25 నుంచి 28 వరకు జరగనున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని అన్నారు. మహిళల సమస్యలపై ఆందోళన మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, హింస సమాజాన్ని తీవ్రమైన సవాల్‌గా మారుస్తున్నాయని ఆమె అన్నారు. మేజర్లైన యువతి–యువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కాలరాస్తూ కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నడ్డి విరుస్తున్నాయని, లక్షల సంఖ్యలో ఉన్న డ్వాక్రా మహిళల సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మీడియాలో మహిళలను అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించడం, అందాల పోటీల పేరుతో మహిళను మార్కెట్ సరుకుగా మారుస్తున్న ధోరణిని తీవ్రంగా ఖండించారు. సామాజిక మార్పు అవసరం భారతీయ సమాజంలో స్త్రీలు, బాలికలపై హింస, అత్యాచారాలు ఆగాలంటే కఠినమైన చట్టాలతో పాటు సామాజిక వ్యవస్థలో మార్పు అవసరం అని అన్నారు. నయా ఉదారవాదం పెంచి పోషిస్తున్న వినిమయ సంస్కృతిపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు మాయ రాణి, భువనగిరి మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి, పట్టణ సహాయ కార్యదర్శి మాటూరి కవిత, ఉపాధ్యక్షురాలు గద్దె లత, వడ్డెబోయిన స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. #AIDWA #AIDWANationalConference #WomenRights #EndViolenceAgainstWomen #GenderEquality #HyderabadEvents #SocialJustice #WomenEmpowerment Follow us on Website Facebook Instagram YouTube