BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఎస్సీ కమిషన్ చైర్మన్ కు గజమాలతో స్వాగతం

తెలంగాణ
10 Jan, 2026 - 06:10 AM
220 వీక్షణలు

ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ బాబుకు గజమాలతో స్వాగతం

బాధితులకు న్యాయం చేయాలని వినతి NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ తొలిసారి అధికార పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో ఆయనను పొలిమేర హరికృష్ణ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం హరికృష్ణ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజాసమస్యలను వివరించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమి ఇచ్చిన నేకునూరి చంద్రయ్యకు ఇప్పటివరకు నగదు అందలేదని, ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. పథకానికి సంబంధించి నిధుల కొరత ఉన్నప్పటికీ, కమిషన్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్‌కు ఉన్న విస్తృత అధికారాలను వినియోగించి తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు గ్రీవెన్స్‌లో సంబంధిత పత్రాలను అందజేశారు. అదేవిధంగా పోలవరం ముంపు బాధితులకు సంబంధించిన సమస్యలను కూడా హరికృష్ణ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వేలేరుపాడు మండలం రుద్రంపేట గ్రామానికి చెందిన వీరయ్యకు సంబంధించిన సర్వే నెంబర్లు 69, 49లోని భూములకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొంత మొత్తం మాత్రమే అందిందని, ఇంకా ఎక్కువ మొత్తంలో పరిహారం రావాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాలను పరిశీలించి బాధితులకు రావాల్సిన మొత్తాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. Follow us on Website Facebook Instagram YouTube