BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

ఎస్సీ కమిషన్ చైర్మన్ కు గజమాలతో స్వాగతం

తెలంగాణ
10 Jan, 2026 - 06:10 AM
260 వీక్షణలు

ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ బాబుకు గజమాలతో స్వాగతం

బాధితులకు న్యాయం చేయాలని వినతి NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ తొలిసారి అధికార పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో ఆయనను పొలిమేర హరికృష్ణ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం హరికృష్ణ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజాసమస్యలను వివరించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమి ఇచ్చిన నేకునూరి చంద్రయ్యకు ఇప్పటివరకు నగదు అందలేదని, ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. పథకానికి సంబంధించి నిధుల కొరత ఉన్నప్పటికీ, కమిషన్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్‌కు ఉన్న విస్తృత అధికారాలను వినియోగించి తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు గ్రీవెన్స్‌లో సంబంధిత పత్రాలను అందజేశారు. అదేవిధంగా పోలవరం ముంపు బాధితులకు సంబంధించిన సమస్యలను కూడా హరికృష్ణ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వేలేరుపాడు మండలం రుద్రంపేట గ్రామానికి చెందిన వీరయ్యకు సంబంధించిన సర్వే నెంబర్లు 69, 49లోని భూములకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొంత మొత్తం మాత్రమే అందిందని, ఇంకా ఎక్కువ మొత్తంలో పరిహారం రావాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాలను పరిశీలించి బాధితులకు రావాల్సిన మొత్తాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. Follow us on Website Facebook Instagram YouTube