BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ప్రభుత్వ సహాయం కోరుతున్న బాధితులు

తెలంగాణ
09 Jan, 2026 - 09:26 AM
144 వీక్షణలు

ఆవు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో బెల్దార్ కుటుంబం

ప్రభుత్వ సహాయం కోరుతున్న బాధితులు NTODAY NEWS:  అమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు అమడగూరు మండల పరిధిలోని లోకోజుపల్లి గ్రామానికి చెందిన ఎస్. బందిగి సాబ్ (ఎస్. అబ్దుల్ ఖాదర్ కుమారుడు) బెల్దార్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవారు. సుమారు ఏడాది క్రితం నరాల బలహీనత కారణంగా కాలు, చేయి పనిచేయకపోవడంతో బెంగళూరులోని NIMHANS ఆసుపత్రిలో మెడ వెనుక శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు శారీరక శ్రమతో కూడిన బెల్దార్ పని చేయవద్దని చెప్పడంతో కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని వెతికారు. ఈ క్రమంలో డ్వాక్రా సంఘం ద్వారా రూ.70,000 రుణం తీసుకుని సుమారు 20 రోజుల క్రితం ఒక సీమ ఆవును కొనుగోలు చేశారు. అయితే ఆరు రోజుల క్రితం ఆవు కాన్పు సమయంలో కుర్ర దూడ అడ్డంగా తిరగడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స చేసి దూడను బయటకు తీశారు. కాన్పు అయిన మరుసటి రోజే కుర్ర దూడ మృతి చెందింది. నేడు ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఆవు కూడా మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జీవనాధారం కోసం ఎంతో ఆశతో కొనుగోలు చేసిన ఆవు మృతి చెందడంతో బందిగి సాబ్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని వారు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube