గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన టీపీసీసీ కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య
NTODAY NEWS: హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకి పార్టీ అధిష్టానం నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంగళవారం రోజున జరిగిన టీపీసీసీ కార్యకనిర్వహక సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమకమైన డీసీసీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం,స్థానిక సంస్థల ఎలక్షన్స్ పై చర్చించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నట రాజన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని,స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు, కష్టపడి పని చేసి ఫలితం ఆశించకుండా ఉంటేనే తగిన గుర్తింపు వస్తుందని నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాటు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube