BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పుల్వామా అమరులకు గొల్లప్రోలులో నివాళి

తెలంగాణ
14 Feb, 2026 - 08:30 PM
264 వీక్షణలు
పుల్వామా అమరులకు గొల్లప్రోలులో నివాళి; ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించిన బీజేపీ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గొల్లప్రోలులో నివాళులర్పించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు మాట్లాడుతూ, పుల్వామా దాడి దేశాన్ని కుదిపేసిన ఘటనగా నిలిచిందని పేర్కొన్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపుర సమీపంలోని లేత్‌పుర ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ వాహన దళంపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించబడినట్లు ఆయన గుర్తుచేశారు. పుల్వామా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అమర జవాన్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ముగిసింది. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. #PulwamaAttack #BlackDay #CRPFMartyrs #Gollaprolu #KakinadaDistrict #TributeToMartyrs #IndiaRemembers Follow us on Website Facebook Instagram YouTube