www.ntodaynews.com
జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన
తెలంగాణ
జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన
రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోరుతూ వినతులు
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు
పుంగనూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రజా సమస్యలు పార్టీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా పుంగనూరు–రామసముద్రం రోడ్డు, పుంగనూరు–ముల్బాగల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, అలాగే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రజలు వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మాట్లాడుతూ, కూటమిలో భాగంగా జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు రామాంజనేయులు, రాష్ట్ర ముదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, లీగల్ సెల్ సభ్యుడు సీవీ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, చౌడేపల్లి నాయకుడు హేమవంత్, పట్టణ నాయకులు భార్గవ్, అనిల్, వినోద్, రూరల్ నాయకులు రెడ్డి, గణ, ఏఎంసీ డైరెక్టర్ మురళి, కోలా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
#Punganur #AnnamayyaDistrict #JanaSenaParty #JanaVani #PublicGrievances
#RoadDevelopment #GovernmentHospital #PeopleIssues #AndhraPradeshNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube