నస్పూర్లో వృద్ధురాలి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
నస్పూర్లో వృద్ధురాలి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 26, 27 డివిజన్లలో నివసిస్తున్న సుబ్బమ్మ (80) అనే వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే చోటుచేసుకున్నప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం ప్రకారం, మృతురాలు ఐదు రోజుల క్రితం వరకు సమీపంలోని హోటల్లో పనిచేస్తూ కనిపించింది. అయితే, ఆమె నివాసం నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన కార్పొరేటర్ రవి మరియు కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.