ఉరుమడ్ల అయ్యప్ప స్వామి గుట్టకు వెలుగులు
ఉరుమడ్ల అయ్యప్ప స్వామి గుట్టకు వెలుగులు
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ సమీపంలో వెలసిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో ఆలయానికి విద్యుత్ స్తంభాలు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయి. ఉరుమడ్ల నుండి వేంబాయికి వెళ్లే దారిలో ఫకీర్ గుట్ట వద్ద ఉన్న ఈ అయ్యప్ప స్వామి దేవస్థానానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరగా, ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందించారు. వెంటనే విద్యుత్ శాఖ ఏడి తో మాట్లాడి ఆలయానికి అవసరమైన కరెంటు స్తంభాలను, లైట్లను ఏర్పాటు చేయించారు.దేవస్థానానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంలో సహకరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు అలాగే విద్యుత్ శాఖ అధికారులకు అయ్యప్ప స్వాములు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్లపు బుద్ధుడు, పూజారి నున్న కృష్ణమోహనాచార్యులు.
భక్తులు: పవన్, దినేష్, నాగరాజు, భరత్, శంకర్, మహేష్, లింగస్వామి, శ్రీశైలం, జగదీష్, కొండ మహేష్, సైదులు, రమేష్, సత్యనారాయణ, నగేష్, సాంబయ్య, రామకృష్ణ, శ్రీను, కృష్ణ, శంకర్, నరేష్, మల్లయ్య. వీరితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది మరియు ఉరుమడ్ల, వేంబాయి గ్రామాల భక్తులు పాల్గొన్నారు.