ఉరుమడ్ల గ్రామంలో సి.సి. రోడ్డు పనుల ప్రారంభం
ఉరుమడ్ల గ్రామంలో సి.సి. రోడ్డు పనుల ప్రారంభం
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నూతన సి.సి. రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి సాగర్ల భానుశ్రీ భిక్షం కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో సమకూర్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తెలియజేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, గంగాపురం రాము, మేడబోయిన స్వాతి శ్రీను మర్రి పూలమ్మ శంకర్, జనపాల శ్రీను
సోషల్ మీడియా ఇంచార్జీ: పట్ల జనార్ధన్ బొడ్డు శ్రీను రూపని భిక్షం, కురుపటి లింగయ్య, సాగర్ల మల్లేష్, కొండా శ్రీను మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.