BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అల్లూరు రామచంద్రుడు ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 08:24 PM
57 వీక్షణలు

పెనుగొలను గ్రామానికి అరుదైన గౌరవం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ శాఖ గ్రంథాలయంలో ద్వితీయ శ్రేణి గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన అల్లూరు రామచంద్రుడు ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ఎంపికయ్యారు.

వేసవి విజ్ఞాన తరగతులను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడంలో విశేష కృషి చేసినందుకు ఆయన సేవలను గుర్తించిన కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ ఏడాది ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ప్రకటించింది.

మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరు రామచంద్రుడిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, కార్యదర్శి వేములపల్లి రవికుమార్, ప్రొఫెసర్ అయ్యంకి వెంకట మురళీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

పెనుగొలను గ్రామానికి చెందిన అల్లూరు రామచంద్రుడు ఈ గౌరవాన్ని అందుకోవడంతో గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమైంది. శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావుతో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.