BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

వాహన్–సారథి సాఫ్ట్‌వేర్ నిలిచిపోవడంతో రవాణా సేవలకు అంతరాయం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
17 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వాహన్ (Vahan), సారథి (Sarathi) సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రవాణా శాఖ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, యాజమాన్య మార్పిడి వంటి కీలక సేవలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాంకేతిక లోపం కారణంగానే వ్యవస్థ నిలిచిపోయిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయని, సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

సాఫ్ట్‌వేర్ పునరుద్ధరణ అనంతరం అన్ని సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, కొంత సమయం తర్వాత కార్యాలయాలను సందర్శించాలని సూచించారు.