BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
06 Apr, 2026 - 05:10 PM
265 వీక్షణలు

వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలసిన శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు..చిట్యాల పట్టణంలో కొలువైన బాల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు కనులపండువగా నిర్వహించబడ్డాయి. స్వామి వారి కళ్యాణ  కార్యక్రమానికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పర్యవేక్షకులుగా వ్యవహరించి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు.​ ఈ కార్యక్రమంలో భాగంగా  ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచే ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం స్వామివారికి శాంతికల్యాణం, ప్రత్యేక హోమాలు నిర్వహించార. కళ్యాణ వేడుక అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.​ఈ వేడుకను వీక్షించేందుకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది.