BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల నాగేశ్వరరావు మాతృమూర్తి అక్కమ్మ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:48 PM
128 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల నాగేశ్వరరావు మాతృమూర్తి అక్కమ్మ (84) బుధవారం వయోభారం కారణంగా కన్నుమూశారు.

అక్కమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చే వ్యక్తిగా ఆమెకు మంచి గుర్తింపు ఉందని స్థానికులు తెలిపారు.

అక్కమ్మ పార్థివదేహాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు వెదురు వెంకటరెడ్డి, ఇనుపనూరి శంకరరావు, సంగెపు దేవసహాయం, వడ్డే బోయిన శ్రీను, తోట శివ, షిరిడీ సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.

తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాసు ఈ విషయం తెలుసుకుని వేల్పుల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అక్కమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.