వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల నాగేశ్వరరావు మాతృమూర్తి అక్కమ్మ కన్నుమూత
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల నాగేశ్వరరావు మాతృమూర్తి అక్కమ్మ (84) బుధవారం వయోభారం కారణంగా కన్నుమూశారు.
అక్కమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చే వ్యక్తిగా ఆమెకు మంచి గుర్తింపు ఉందని స్థానికులు తెలిపారు.
అక్కమ్మ పార్థివదేహాన్ని వైఎస్సార్సీపీ నాయకులు వెదురు వెంకటరెడ్డి, ఇనుపనూరి శంకరరావు, సంగెపు దేవసహాయం, వడ్డే బోయిన శ్రీను, తోట శివ, షిరిడీ సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.
తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాసు ఈ విషయం తెలుసుకుని వేల్పుల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అక్కమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.