BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వెల్గటూర్ మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్‌ నియామకం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Apr, 2026 - 02:36 PM
81 వీక్షణలు

వెల్గటూర్ మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్‌గా గోళ్ళ తిరుపతి నియామకం

​వెల్గటూర్, ఏప్రిల్ 13:

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్‌గా మత్తునూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోళ్ళ తిరుపతి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.

​ఈ సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గోళ్ళ తిరుపతికి పలువురు నాయకులు, గ్రామస్తులు ఘనంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, మార్కెట్ కమిటీ పరిధిలో పారదర్శకమైన సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

​పాల్గొన్న ముఖ్య నాయకులు:

​ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మెరుగు మురళి, మత్తునూర్ గ్రామస్తులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.