వెల్లంకి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యను గుర్తించి స్థానిక మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన నూతన కరెంటు పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు. దీంతో గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, 11వ వార్డు సభ్యులు గంజి భాస్కర్, తాటి భిక్షపతి, గంజి నర్సింహ, బొల్ల రామ్ నారాయణ, కర్రే రమేష్, రుద్ర వెంకటేష్, గోధుమల సోమప్ప, తాటి ఉపేందర్, మహేందర్, ప్రదీప్, రాజు, ఐటిపాముల శివ గణేష్, దేవరకొండ ఉపేందర్ చారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు తిమ్మాపురం మహేందర్ రెడ్డి మరియు వేముల వీరేశం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.