వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపురం (ఆరవ వార్డు) గ్రామ రైతులకు ఊరటనిస్తూ, నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నూతన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని వెంకటాపురం గ్రామానికి మంజూరు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చిట్యాల పట్టణ లో ఉన్న మార్కెట్ కి తరలించేవారు అని ,ఈ నూతన కొనుగోలు కేంద్ర ద్వారా రైతులు తమ గ్రామంలోని సులువుగా పంట నమ్ముకోవచ్చని తెలియజేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ ద్వారా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మెన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు,, కౌన్సెలర్లు కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.