BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:26 PM
118 వీక్షణలు

విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి--జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులను పకడ్బందీగా కుట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి  కందుల సత్యనారాయణ అన్నారు.ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకుని,ఆ కొలతల ప్రకారం దుస్తులు కుట్టాలని శిక్షణ పొందుతున్న స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు.దుస్తులు కుట్టడానికి వాడే దారం,గుండీలు నాణ్యమైన వాటిని ఉపయోగించాలన్నారు. దుస్తులకు వేసే కుట్లు కూడా దగ్గరగా వేసి,మధ్యలో చినిగిపోకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మహిళలు తమ స్వంత పిల్లలకు దుస్తులు తయారు చేసిన విధంగా భావిస్తూ,నాణ్యమైన వాటిని అందించాలన్నారు.భువనగిరి పట్టణంలో ఉన్న విదిత కుట్టు శిక్షణా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించి,శిక్షణ జరిగే తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి,డి ఆర్ డి ఎ జిల్లా ఏ.పీ.ఎం.పసునూరి రమణ తదితరులు పాల్గొన్నారు.