www.ntodaynews.com
విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేయాలి: సుప్రీంకోర్టు
జాతీయం
న్యూఢిల్లీ, జూలై 29: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సూచించిన న్యాయస్థానం, నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ వరకు విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.