BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విధి నిర్వహణలోనే డీటీఓ వెంకన్న మృతి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:30 PM
112 వీక్షణలు

భూపాలపల్లి, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న (45) మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని రవాణా శాఖ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు టిప్పర్ లారీ అదుపుతప్పి ఆయనపైకి దూసుకెళ్లింది.

వివరాల ప్రకారం, రవాణా శాఖ సిబ్బందితో కలిసి వెంకన్న తనిఖీలు చేపడుతుండగా పరకాల వైపు నుంచి వచ్చిన టిప్పర్ లారీ ముందుగా రోడ్డుపక్కన ఉన్న హార్వెస్టర్ వాహనాన్ని, అనంతరం డీటీఓ అధికారిక వాహనాన్ని ఢీకొట్టి వెంకన్నను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ టైర్లు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనతో అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంకన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందినవారు. ఇటీవలే జగిత్యాల జిల్లా నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు విఫలమవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెంకన్న మృతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించిన మంత్రి, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.