www.ntodaynews.com
వికలాంగుల కోసం ఇచ్చిన స్కూటీల దుర్వినియోగం?
తెలంగాణ
భద్రాచలంలో ఇటీవల అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా వికలాంగులకు పంపిణీ చేసిన స్కూటీలను కొందరు లబ్ధిదారులు కాకుండా వారి బంధువులు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని స్కూటీలను రీ-మోడలింగ్ చేసి వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వికలాంగుల స్వావలంబన కోసం ప్రభుత్వం అందించిన వాహనాలు అసలు లబ్ధిదారులకే ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లబ్ధిదారుల సంక్షేమం కోసం అందించిన సదుపాయాలు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.