www.ntodaynews.com
వన్ కేస్ - వన్ డేటాను ప్రకటించిన సీజేఐ
జాతీయం
‘వన్ కేస్ - వన్ డేటా’ను ప్రకటించిన సీజేఐ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వన్ కేస్ - వన్ డేటా’ (One Case - One Data) పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల కేసుల డేటా మొత్తం ఒకే డిజిటల్ వ్యవస్థ కింద అందుబాటులోకి రానుంది. దీంతో కేసుల సమాచారం వేగంగా, పారదర్శకంగా అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడనుంది.
అలాగే, న్యాయపరమైన సందేహాలు, సలహాల కోసం ‘సు సహాయ్’ (Su Sahay) అనే ఏఐ చాట్బాట్ను కూడా సీజేఐ పరిచయం చేశారు. ఈ చాట్బాట్ ద్వారా సాధారణ ప్రజలకు న్యాయ సమాచారాన్ని సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.