BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

వరంగల్ కలెక్టర్‌కు విశ్వబ్రాహ్మణ సంఘం వినతి

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:14 PM
58 వీక్షణలు

వరంగల్ కలెక్టర్‌కు విశ్వబ్రాహ్మణ సంఘం వినతి

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదను విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మాటూరి (కురిమిల్ల) రమేష్ నేతృత్వం వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కులాల వారీ జనాభా వివరాల్లో విశ్వబ్రాహ్మణ వృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పకారులు, కంసాలి (అవుసుల)లను వేర్వేరు కులాలుగా చూపించడంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వృత్తులు కులాలు కాకుండా వృత్తులుగా మాత్రమే పరిగణించి, అన్ని వర్గాలను కలిపి విశ్వబ్రాహ్మణులుగా గుర్తించాలని కోరారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, కులగణనకు ముందే డెడికేటెడ్ కమిటీకి తమ సంఘాల ద్వారా నివేదికలు, వినతులు సమర్పించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం విడుదలైన కులాల వివరాల్లో తమ వర్గాన్ని విడదీసి చూపించడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

విశ్వబ్రాహ్మణ వృత్తులను కేవలం ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, కానీ కులాలుగా విభజించకూడదని స్పష్టం చేశారు. గెజిట్ ద్వారా విడివిడిగా చూపించిన జనాభాను ఒకే కులంగా, విశ్వబ్రాహ్మణులుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం తమ వినతిని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పంచకోటి సాంబమూర్తి, కోశాధికారి సింధోజు సుమన్, కమిటీ సభ్యులు గన్నోజు సంజీవ, ఊసాల శ్రీనివాస్, గన్నోజు బాబు చారి తదితరులు పాల్గొన్నారు.