BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

వరంగల్ కలెక్టర్‌కు విశ్వబ్రాహ్మణ సంఘం వినతి

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:14 PM
27 వీక్షణలు

వరంగల్ కలెక్టర్‌కు విశ్వబ్రాహ్మణ సంఘం వినతి

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదను విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మాటూరి (కురిమిల్ల) రమేష్ నేతృత్వం వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కులాల వారీ జనాభా వివరాల్లో విశ్వబ్రాహ్మణ వృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పకారులు, కంసాలి (అవుసుల)లను వేర్వేరు కులాలుగా చూపించడంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వృత్తులు కులాలు కాకుండా వృత్తులుగా మాత్రమే పరిగణించి, అన్ని వర్గాలను కలిపి విశ్వబ్రాహ్మణులుగా గుర్తించాలని కోరారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, కులగణనకు ముందే డెడికేటెడ్ కమిటీకి తమ సంఘాల ద్వారా నివేదికలు, వినతులు సమర్పించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం విడుదలైన కులాల వివరాల్లో తమ వర్గాన్ని విడదీసి చూపించడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

విశ్వబ్రాహ్మణ వృత్తులను కేవలం ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, కానీ కులాలుగా విభజించకూడదని స్పష్టం చేశారు. గెజిట్ ద్వారా విడివిడిగా చూపించిన జనాభాను ఒకే కులంగా, విశ్వబ్రాహ్మణులుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం తమ వినతిని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పంచకోటి సాంబమూర్తి, కోశాధికారి సింధోజు సుమన్, కమిటీ సభ్యులు గన్నోజు సంజీవ, ఊసాల శ్రీనివాస్, గన్నోజు బాబు చారి తదితరులు పాల్గొన్నారు.