BREAKING
గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు
www.ntodaynews.com

వర్షాల కోసం రాజవరం గ్రామంలో నగర సంకీర్తన.. గోమాత ఫోటోలు, హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 09:24 AM
41 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో లోకం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు.

ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తనలో భక్తులు "శ్రీరామ.. జయ రామ.. జయ జయ రామ" నామస్మరణ చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం, బొడ్రాయి, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు.

తదుపరి గంపలగూడెం దాత కుందా కోటేశ్వరావు అందజేసిన గోమాత ఫోటోలు, హనుమాన్ చాలీసా పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ ఆర్గనైజర్ పారేపల్లి కృష్ణారావు, గ్రామ మాజీ సర్పంచులు అబ్బూరి వెంకటయ్య, చెన్నుపాటి నరసింహారావు, మెట్టగుట్ట దేవస్థానం కమిటీ కార్యదర్శి మన్నె నరసింహమూర్తి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల యుగంధర్, జిల్లా సమన్వయకర్త అన్నవరపు కాంతికుమార్, సహకార సంఘ మాజీ అధ్యక్షుడు బండారుపల్లి వెంకట నరసయ్య, సాయిబాబా కమిటీ సభ్యులు వై. జగన్నాథం, తొండపు శ్రీను, సుగ్గల ప్రసాద్, మన్నె లక్ష్మణ్‌తో పాటు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.