BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఘనంగా వసంత పంచమి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:39 PM
250 వీక్షణలు
లోత్తునూరు గ్రామంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి: లక్ష్మణ్ గొల్లపల్లి మండలంలోని లోత్తునూరు గ్రామంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల సుమన్ మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు చదువు బలమైన పునాదిగా నిలుస్తుందని, వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడం శుభప్రదమని తెలిపారు. చదువుతో పాటు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు, కోడిగుడ్లు, పండ్లు మరియు పోషక విలువలు గల చిరుధాన్యాలను పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. సరైన పోషకాహారం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని వివరించారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ కుమారస్వామి, జయ, ఉపసర్పంచ్ ఓరగంటి మల్లేష్, అంగన్వాడీ టీచర్ డి. స్వప్న, లక్కం మణికంఠ, ఆయా, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #VasanthaPanchami #Aksharabhyasam #EarlyEducation #Anganwadi #ChildDevelopment #VillageNews #EducationFirst #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube