BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘనంగా వసంత పంచమి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:39 PM
307 వీక్షణలు
లోత్తునూరు గ్రామంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి: లక్ష్మణ్ గొల్లపల్లి మండలంలోని లోత్తునూరు గ్రామంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల సుమన్ మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు చదువు బలమైన పునాదిగా నిలుస్తుందని, వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడం శుభప్రదమని తెలిపారు. చదువుతో పాటు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు, కోడిగుడ్లు, పండ్లు మరియు పోషక విలువలు గల చిరుధాన్యాలను పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. సరైన పోషకాహారం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని వివరించారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ కుమారస్వామి, జయ, ఉపసర్పంచ్ ఓరగంటి మల్లేష్, అంగన్వాడీ టీచర్ డి. స్వప్న, లక్కం మణికంఠ, ఆయా, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #VasanthaPanchami #Aksharabhyasam #EarlyEducation #Anganwadi #ChildDevelopment #VillageNews #EducationFirst #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube