BREAKING
టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్
www.ntodaynews.com

సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు

తెలంగాణ
28 Feb, 2026 - 07:02 AM
173 వీక్షణలు
సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 2027 గోదావరి పుష్కరాలపై జిల్లా స్థాయి సమీక్ష జగిత్యాల, ఫిబ్రవరి 28: 2027 గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ఎలాంటి అసౌకర్యం లేకుండా వీఐపీ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు, ఈవై కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల రద్దీపై అంచనాలు 2015 పుష్కరాల్లో జగిత్యాల జిల్లాలో సుమారు కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించగా, 2027 నాటికి ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ. 940 కోట్ల ప్రణాళిక జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 940 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రితో త్వరలో చర్చిస్తామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీరు, వైద్యసేవలు, భద్రతా చర్యలు పుష్కరాల సమయంలో సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. గోదావరి తీరంలోని ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అధికారులపై ఆగ్రహం సమీక్షా సమావేశానికి హాజరుకాని అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. #GodavariPushkaralu #Jagtial #AdluriLakshmanKumar #TelanganaNews #Pushkaralu2027 #PublicInfrastructure Follow us on Website Facebook Instagram YouTube