BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు

తెలంగాణ
28 Feb, 2026 - 07:02 AM
167 వీక్షణలు
సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 2027 గోదావరి పుష్కరాలపై జిల్లా స్థాయి సమీక్ష జగిత్యాల, ఫిబ్రవరి 28: 2027 గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ఎలాంటి అసౌకర్యం లేకుండా వీఐపీ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు, ఈవై కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల రద్దీపై అంచనాలు 2015 పుష్కరాల్లో జగిత్యాల జిల్లాలో సుమారు కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించగా, 2027 నాటికి ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ. 940 కోట్ల ప్రణాళిక జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 940 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రితో త్వరలో చర్చిస్తామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీరు, వైద్యసేవలు, భద్రతా చర్యలు పుష్కరాల సమయంలో సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. గోదావరి తీరంలోని ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అధికారులపై ఆగ్రహం సమీక్షా సమావేశానికి హాజరుకాని అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. #GodavariPushkaralu #Jagtial #AdluriLakshmanKumar #TelanganaNews #Pushkaralu2027 #PublicInfrastructure Follow us on Website Facebook Instagram YouTube