www.ntodaynews.com
ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
తెలంగాణ
వివేకానంద జయంతి వేడుకలు: జగిత్యాలలో ఘనంగా నివాళులు
వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 49వ వార్డులో ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని పేర్కొంటూ, యువత దేశ నిర్మాణంలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ఎలామాద్రి కిషోర్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణు మాధవ్, భారత్, ప్రశాంత్, కావేటి నవీన్, మధుకర్, అనురాధ, కవిత పాల్గొన్నారు. అలాగే విగ్రహ నిర్మాత లక్ష్మీ నారాయణ భార్య గోదావరి హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#SwamiVivekananda
#VivekanandaJayanti
#NationalYouthDay
#Jagtial
#YouthInspiration
#BRSParty
#TelanganaNews
#LocalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube