www.ntodaynews.com
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి!!
తెలంగాణ
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి!!
NTODAY NEWS: లక్ష్మి ప్రసాద్. మెదక్ &సంగారెడ్డి ఇంచార్జ్
మెదక్ బ్యూరో న్యూస్..
మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ డి వి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే జాతీయ మెగా జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు.. రాజీయే రాజ మార్గమన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు , ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
Follow us on
Website
Facebook
Instagram
YouTube