BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ఆధ్యాత్మిక కేంద్రంగా ధర్మపురిని తీర్చిదిద్దుతాం

తెలంగాణ
28 Feb, 2026 - 06:13 AM
42 వీక్షణలు
ఆధ్యాత్మిక కేంద్రంగా ధర్మపురిని తీర్చిదిద్దుతాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలిరావాలని పిలుపు ధర్మపురి, ఫిబ్రవరి 28: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సంపూర్ణ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. సభ స్థలం, భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహకారంతో బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. పీఠాధిపతుల ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉచిత భోజన పథకం ప్రారంభం ధర్మపురి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో పాత టీటీడీ కల్యాణ మండపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు సంఘనభట్ల దినేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #Dharmapuri #LakshmiNarasimhaSwamy #Brahmotsavam #Kalyanotsavam #SpiritualCenter #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube