మా ఓటును డబ్బుకి, మద్యానికి అమ్ముకోము
నిజాయితీతో గ్రామాల అభివృద్ధికి కృషి చేసే నాయకులను ఎన్నుకుంటామని ఇంటి ముందు బోర్డులు పెట్టిన మహిళా ఓటర్లు..
NTODAY NEWS: బొమ్మలరామారం
మా ఓటు గ్రామాభివృద్ధి కి కానీ ఒక్కరోజు నాయకులు ఇచ్చే డబ్బుకు కాదని..యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ హనుమంత రావు పిలుపు మేరకు ఓటర్లలో మంచి స్పందన వచ్చింది.మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 6 మండలాల్లో శుక్రవారం ఉదయం ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో బొమ్మల రామారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఓటు హక్కు పై మహిళలకు విసృత స్థాయి అవగాహన కల్పించారు.మహిళా ఓటరుల అందరితో ఓటుని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని మద్యానికి కానీ డబ్బుకు కానీ మా ఓటు ని అమ్ముకోము అని మా ఓటు ని గ్రామాభివృద్ది చేసే నాయకులను ఎన్నుకోవడం కోసం ఉపయోగించుకుంటాం అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.అవగాహన పొందిన మహిళలు ఈరోజు బొమ్మల రామారం మండలంలోని జలాలపూర్ గ్రామనికి చెందిన కొందరు ఓటర్లు తమ ఇండ్ల ముందు స్వచ్ఛందంగా మాకు డబ్బులు,గిఫ్ట్ లకు మా ఓటుని అమ్ముకోమని,నీతి నిజాయితీ తో స్వచ్ఛందంగా మా ఓటు వేస్తాం అని బోర్డులు లు ఏర్పాటు చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube