www.ntodaynews.com
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాం
తెలంగాణ
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాం
అమడగూరులో లో ఓల్టేజ్ సమస్య పరిష్కరిస్తాం NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు సత్యసాయి జిల్లా అమడగూరు, మండలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని విద్యుత్ శాఖ డి.ఈ. క్రిష్ణదేవ పేర్కొన్నారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అంతేకాకుండా మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు.ఈ సందర్బంగా చౌడేశ్వరీ దేవి ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నుంచి బస్టాండ్ ప్రాంతం వరకు రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు సక్రమమైన రీతిలో అమర్చాలని డీ.ఈ.కి సూచించారు.దీంతో విద్యుత్ అధికారులు అమ్మవారు రథోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ స్థంబాలను రోడ్డుకు అడ్డు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.మండల కేంద్రంలో వోల్టేజ్ నివారణకు రెండు అదనపు ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి దృశ్య విద్యుత్ సౌకర్యం ఆటంకం కలగకుండా విద్యుత్ సిబ్బంది గ్రామాలకు వెళ్లి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిఈ ఆదేశించారు.విద్యుత్ విద్యుత్ సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత లైన్ మాన్ లతో సంప్రదించాలని తెలిపారు.చినగానిపల్లి పీడర్ లో విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడి ఓబులేసు,మండల విద్యుత్ అధికారి చంద్ర నాయక్,లైన్ మెన్ లు భాస్కర్ రెడ్డి,విశ్వనాథ రెడ్డి, రామాంజులు,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube