BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలేంటి?

తెలంగాణ
08 Aug, 2025 - 06:53 AM
162 వీక్షణలు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలేంటి? NTODAY NEWS: ఢిల్లీ/ఏలూరు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం. దిల్లీ/ఏలూరు ‎గత మూడేళ్లలో CRIF కింద ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన రహదారుల ప్రాజెక్టులపై సమాచారం, పురోగతిలో ఉన్న రోడ్ల వివరాలు, వాటి పొడవు, ఖర్చు కోరుతూ ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సిఆర్ఐఎఫ్ పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వివరాలు. ప్రస్తుత సంవత్సరంతో సహా గత మూడేళ్ళలో రూ: 535 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ లో 691 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన 20 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం రూ: 1,256 కోట్ల వ్యయంతో 534 కిలోమీటర్ల పొడవు గల 55 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు CRIF కింద నిర్మాణంలో ఉన్నాయని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. అంతేకాకుండా రూ: 1,928 కోట్ల వ్యయంతో 718 కిలోమీటర్ల పొడవైన మరో 57 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులను కూడా కేంద్రం ఆమోదించిందని కేంద్ర మంత్రి తెలిపారు. "సిఆర్ఐఎఫ్ చట్టం-2000" నిబంధనలు ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన నిధులు కేటాయిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube