BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలేంటి?

తెలంగాణ
08 Aug, 2025 - 06:53 AM
243 వీక్షణలు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలేంటి? NTODAY NEWS: ఢిల్లీ/ఏలూరు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం. దిల్లీ/ఏలూరు ‎గత మూడేళ్లలో CRIF కింద ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన రహదారుల ప్రాజెక్టులపై సమాచారం, పురోగతిలో ఉన్న రోడ్ల వివరాలు, వాటి పొడవు, ఖర్చు కోరుతూ ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సిఆర్ఐఎఫ్ పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వివరాలు. ప్రస్తుత సంవత్సరంతో సహా గత మూడేళ్ళలో రూ: 535 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ లో 691 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన 20 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం రూ: 1,256 కోట్ల వ్యయంతో 534 కిలోమీటర్ల పొడవు గల 55 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు CRIF కింద నిర్మాణంలో ఉన్నాయని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. అంతేకాకుండా రూ: 1,928 కోట్ల వ్యయంతో 718 కిలోమీటర్ల పొడవైన మరో 57 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులను కూడా కేంద్రం ఆమోదించిందని కేంద్ర మంత్రి తెలిపారు. "సిఆర్ఐఎఫ్ చట్టం-2000" నిబంధనలు ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన నిధులు కేటాయిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube