www.ntodaynews.com
యూపీలో ప్రకృతి విపత్తు బీభత్సం.. 111కి చేరిన మృతుల సంఖ్య
జాతీయం
ఉత్తరప్రదేశ్లో బుధవారం వీచిన భారీ గాలిదుమారం, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రాన్ని వణికించాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 111కి చేరగా.. 72 మంది గాయపడ్డారు.
ఈ ప్రకృతి విపత్తు ధాటికి 227 ఇళ్లు కూలిపోగా.. 170 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది.
26 జిల్లాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.