BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

యుద్ధ ప్రభావం: భగ్గుమంటున్నా వంట నూనెల ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:05 PM
74 వీక్షణలు

యుద్ధ ప్రభావం: వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి

న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పెరుగుదల కనిపించగా, మార్చి నెలలో ధరలు మరింత ఎగబాకాయి.

మార్కెట్‌లో ప్రస్తుతం లీటర్ పామోలిన్ నూనె ధర రూ.145కు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె రూ.175 వద్ద విక్రయమవుతోంది. బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

వివరాల ప్రకారం, సన్‌ఫ్లవర్ నూనెపై రూ.21, పామోలిన్‌పై రూ.12, వేరుశనగ నూనెపై రూ.16 చొప్పున పెరుగుదల నమోదైంది. దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అనిశ్చితి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం, సమీప భవిష్యత్తులో కూడా వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది.