యుద్ధ ప్రభావం: భగ్గుమంటున్నా వంట నూనెల ధరలు
యుద్ధ ప్రభావం: వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి
న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పెరుగుదల కనిపించగా, మార్చి నెలలో ధరలు మరింత ఎగబాకాయి.
మార్కెట్లో ప్రస్తుతం లీటర్ పామోలిన్ నూనె ధర రూ.145కు చేరుకోగా, సన్ఫ్లవర్ నూనె రూ.175 వద్ద విక్రయమవుతోంది. బ్రాండ్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
వివరాల ప్రకారం, సన్ఫ్లవర్ నూనెపై రూ.21, పామోలిన్పై రూ.12, వేరుశనగ నూనెపై రూ.16 చొప్పున పెరుగుదల నమోదైంది. దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం, సమీప భవిష్యత్తులో కూడా వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది.