BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

యుద్ధ ప్రభావం: భగ్గుమంటున్నా వంట నూనెల ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:05 PM
57 వీక్షణలు

యుద్ధ ప్రభావం: వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి

న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పెరుగుదల కనిపించగా, మార్చి నెలలో ధరలు మరింత ఎగబాకాయి.

మార్కెట్‌లో ప్రస్తుతం లీటర్ పామోలిన్ నూనె ధర రూ.145కు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె రూ.175 వద్ద విక్రయమవుతోంది. బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

వివరాల ప్రకారం, సన్‌ఫ్లవర్ నూనెపై రూ.21, పామోలిన్‌పై రూ.12, వేరుశనగ నూనెపై రూ.16 చొప్పున పెరుగుదల నమోదైంది. దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అనిశ్చితి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం, సమీప భవిష్యత్తులో కూడా వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది.