BREAKING
తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
Date of Publish : 16 April 2026, 07:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:58 PM
154 వీక్షణలు

యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన

కామవరపు కోట: నేటి యువత చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డ్వాక్రా, మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడినట్లు తెలిపారు. గురువారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇష్టాగోష్టి నిర్వహించారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అలాగే యోగా, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

"ఉద్యోగాలపై మాత్రమే ఆశ్రయించకుండ, పారిశ్రామిక రంగంలో కూడా ప్రగతి సాధించవచ్చు," అని మంత్రి కొండపల్లి తెలిపారు. ఆయన, యువకులను చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించే కూటమి ప్రభుత్వ విధానాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరమల్ల సౌజన్ సాయి, నిడికొండ రమేష్, నితిన్ సాయి తదితరులు పాల్గొన్నారు.