BREAKING
బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

​యువత ఐక్యత ముందర తలవంచిన కేంద్రం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హర్షం

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 05:10 PM
55 వీక్షణలు

​యువత ఐక్యత ముందర తలవంచిన కేంద్రం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హర్షం

​గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగించిన ఉక్కుపాదం లాంటి సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల ఆగ్రహ జ్వాలలకు లొంగి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఘాటుగా స్పందించారు. ఈ విజయాన్ని భారతదేశ యువత సాధించిన చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు.

​"ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా కాదు... తమ హక్కుల కోసం దేశమంతా ఒక్కటై పోరాడిన భారతీయ యువత సాధించిన అపారమైన విజయం! యువకులు ఒక లక్ష్యం కోసం కంకణం కట్టుకుని రోడ్డెక్కితే ఎంతటి ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని ఈరోజు నిరూపితమైంది," అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.

​అధికార బీజేపీ అహంకార వైఖరికి ఈ రాజీనామా చెంపపెట్టు లాంటిదని విమర్శించిన ఎంపీ, ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో, హక్కులతో మళ్ళీ ఆడుకోవాలని చూస్తే న్యాయం కోసం యువతతో కలిసి మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ, దేశ యువతకు అభినందనలు తెలిపారు