BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల
17 Mar, 2026 - 01:16 PM
225 వీక్షణలు

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని కేజీబీవీ (KGBV) పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు మంగళవారం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పుట్ట యశోద మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్. అనిత హాజరై, తమ చేతుల మీదుగా 56 మంది విద్యార్థులకు అద్దాలను అందజేశారు.

ఇటీవల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో భాగంగా, దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన 56 మందిని ఎంపిక చేసి ప్రభుత్వం ఈ అద్దాలను సరఫరా చేసింది.

అధికారుల సూచనలు:

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థులు కంటి అద్దాలను క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దూరదృష్టి లోపంతో బాధపడేవారు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. విటమిన్ 'ఏ' అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తహసీల్దార్, వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా నోడల్ అధికారి, మాస్ మీడియా అధికారి, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.