www.ntodaynews.com
90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ
జాతీయం
90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ
బాంబే హైకోర్టులో 90 ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
తనను ‘డిఫాల్టర్’గా పిలిచినందుకు హౌసింగ్ కమిటీ సభ్యులపై ఆమె కేసు వేసింది. ఈ కేసులో కమిటీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు అంగీకరించినప్పటికీ, వృద్ధురాలు దానిని స్వీకరించలేదు.
దీంతో ‘అహంకార పోరాటాల’ కారణంగా కోర్టు సమయం వృథా అవుతోందని వ్యాఖ్యానిస్తూ, తొలుత విచారణను 2046 సంవత్సరానికి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.
అయితే తాజా పరిణామంలో కోర్టు ఆ నిర్ణయాన్ని సవరించి, కేసు విచారణను జులై నెలకు వాయిదా వేసింది.