www.ntodaynews.com
పుల్వామా అమరవీరులకు లోత్తునూర్లో ఘన నివాళి
తెలంగాణ
పుల్వామా అమరవీరులకు లోత్తునూర్లో ఘన నివాళి
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారత సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను స్మరిస్తూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు.
లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆకుల సుమన్ మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన జవాన్ల త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, గ్రామస్తులు దేశభక్తి నినాదాలతో అమరవీరుల సేవలను స్మరించారు.
#PulwamaAttack #CRPFMartyrs #Tribute #Gollapalli #Lothunur #RespectToMartyrs
Follow us on
Website
Facebook
Instagram
YouTube