www.ntodaynews.com
ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నారా? ఇక ఉచితం!
జాతీయం
ఆధార్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త తెలిపింది. ఆధార్కు అనుసంధానమైన ఈమెయిల్ ఐడీని ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఇప్పటివరకు ఈమెయిల్ అప్డేట్ కోసం రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఛార్జీని పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.
ఈ సౌకర్యం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఆధార్తో ఈమెయిల్ లింక్ చేసి ఉంటే ముఖ్యమైన సమాచారం, నోటిఫికేషన్లు, అప్డేట్లు నేరుగా పొందవచ్చు.
ఆధార్ వివరాలను తాజాగా ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.