BREAKING
అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ
www.ntodaynews.com

ఆలయంలోని వీరభద్రస్వామికి విశేష పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 06:11 PM
33 వీక్షణలు

ఆలయంలోని వీరభద్రస్వామికి విశేష పూజలు 

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

తేది:  25.03.2026

ఆలయ ప్రాంగణములోని  వీరభద్రస్వామికి విశేష పూజలు

లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (25.03.2026) సాయంకాలం ఆలయ ప్రాంగణం లోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహిస్తోంది. 

ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికాగుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్టరూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూజించడం జరుగుతోంది. 

కాగా ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేషఅభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది. 

ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది. 

కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను నిర్వహించబడుతుంది.

తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.

ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను జరిపించబడుతుంది.

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ