ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాటర్ కూలర్ విరాళం
ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను విరాళంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కె.బాలసుబ్రమణ్యం మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అమరావతి సురేష్, మరియు సంకల్పశక్తి ఫౌండర్ వేణుగోపాల్, జూటూరు సురేష్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా ఇవ్వడం జరిగినది.
ఈ వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి ఈ వాటర్ కూలర్ ఉపయోగపడుతుంది. ఈ వాటర్ కూలర్ ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి ,డ్రైవర్లకు ,కండక్టర్లకు ఎంతో ఉపయోగమని డిపో మేనేజర్ దినేష్ గారు తెలియజేశారు.
ఈ వాటర్ కూలర్ విరాళంగా అందజేసిన కె.బాలసుబ్రమణ్యం గారు ,అమరావతి సురేష్, జూటూరు సురేష్, జూటూరు వేణుగోపాల్ ,వీరిని ప్రత్యేకంగా డిపో మేనేజర్ దినేష్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మేనేజర్ దినేష్ ,ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు ,కండక్టర్లు ,ప్రయాణికులు పాల్గొన్నారు.