ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి – కేంద్రం కొత్త నిబంధనలు అమలు
ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ (Permanent Account Number) కార్డును తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం
రూ.20 లక్షలకు పైగా విలువైన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు పాన్ తప్పనిసరి చేయబడింది. అలాగే రూ.2 లక్షలకు మించిన విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకు పైగా షేర్ల కొనుగోలు, అమ్మకాలకు కూడా పాన్ అవసరం అని స్పష్టం చేసింది.
అదేవిధంగా కారు, బైక్ వంటి వాహనాల కొనుగోలు రూ.5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పనిసరి. డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా పాన్ వివరాలు సమర్పించాల్సిందే.
పాన్ వివరాలు ఇవ్వకపోతే సంబంధిత ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. తప్పుడు వివరాలు సమర్పించినట్లయితే రూ.10 వేల వరకు జరిమానాతో పాటు ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.