ఏడు నిమిషాల్లో క్యాన్సర్ చికిత్స.. కొత్త ఇంజెక్షన్కు అనుమతి
ఏడు నిమిషాల్లో క్యాన్సర్ చికిత్స.. కొత్త ఇంజెక్షన్కు అనుమతి
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు శుభవార్త. కేవలం ఏడు నిమిషాల్లో ఇవ్వగలిగే సరికొత్త క్యాన్సర్ ఇంజెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు గంటలపాటు సాగే చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ ఇంజెక్షన్ ఉపయోగపడనుంది.
ఈ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర సుమారు రూ.3.7 లక్షలు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద అర్హులైన రోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం లభించే అవకాశం ఉంది.
వైద్యుల ప్రకారం, ఈ కొత్త చికిత్స విధానం వల్ల రోగులు ఆస్పత్రిలో గడిపే సమయం గణనీయంగా తగ్గడంతో పాటు చికిత్స ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది.
వైద్య రంగంలో ఈ అభివృద్ధి క్యాన్సర్ చికిత్సను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చే కీలక ముందడుగుగా భావిస్తున్నారు.