BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 02:01 PM
86 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం – వినియోగదారుల ఆందోళన

ఏలూరు జిల్లా చింతలపూడిలోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరారు. గత పది రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏజెన్సీ సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

తాజాగా చింతలపూడి మండల హోటల్ యాజమాన్య సంఘం ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించనుంది. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల హోటల్ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వారు పేర్కొంటున్నారు.

ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిలిండర్ల కోసం క్యూలో నిలబడిన వినియోగదారులకు కనీస తాగునీటి వసతి కూడా లేకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.

రెండోసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికి కేవైసీ తప్పనిసరి అంటూ ఏజెన్సీ సిబ్బంది చెబుతుండటంతో వినియోగదారులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా వ్యవస్థను సజావుగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.