BREAKING
ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ ​బోరుబావిలో పడ్డ మనవడు. కాపాడబోయి తాత ప్రాణత్యాగం! రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ ​బోరుబావిలో పడ్డ మనవడు. కాపాడబోయి తాత ప్రాణత్యాగం! రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం
www.ntodaynews.com

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 02:01 PM
21 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం – వినియోగదారుల ఆందోళన

ఏలూరు జిల్లా చింతలపూడిలోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరారు. గత పది రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏజెన్సీ సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

తాజాగా చింతలపూడి మండల హోటల్ యాజమాన్య సంఘం ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించనుంది. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల హోటల్ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వారు పేర్కొంటున్నారు.

ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిలిండర్ల కోసం క్యూలో నిలబడిన వినియోగదారులకు కనీస తాగునీటి వసతి కూడా లేకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.

రెండోసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికి కేవైసీ తప్పనిసరి అంటూ ఏజెన్సీ సిబ్బంది చెబుతుండటంతో వినియోగదారులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా వ్యవస్థను సజావుగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.