www.ntodaynews.com
ఏపూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో మతసామరస్యం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
ఏపూర్ జెడ్.పి.హెచ్.ఎస్ లో మతసామరస్యం
చిట్యాల మండల పరిధిలోని ఏపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మతసామరస్యం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులకు తోటి ఉపాధ్యాయ బృందం అండగా నిలిచింది. పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీమతి కైసర్ సబిహ మరియు హిందీ ఉపాధ్యాయులు MD వాహిద్ నిష్టతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు. వీరి దీక్షా విరమణ (ఇఫ్తార్) కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు
బండ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి స్వయంగా ఉపాధ్యాయులకు ఇఫ్తార్ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులు బుచ్చి రెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, నర్సయ్య, లీలావతి, మరియు వెంకన్న తదితరులు పాల్గొన్నారు