www.ntodaynews.com
అక్రమ నిర్మాణాలను తొలగించాలని పిర్యాదు
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
అక్రమ నిర్మాణాలను తొలగించాలని డీసీకు బీజేపీ పిర్యాదు
బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న సెట్ బ్యాక్, పార్క్ లో నిర్మిస్తున్న అక్రమ చర్చ్ లను తొలగించాలని దుండిగల్ బిజెపి నాయకులు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ గతంలో కేవలం షామియానా మాత్రమే వేసుకొని కార్యక్రమం చేసుకోవాలని ,ఎలాంటి కట్టడాలు( చర్చ్) నిర్మాణాలు చేపట్టకూడదని కోర్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.కావున అక్రమ నిర్మాణాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దుండిగల్ బిజెపి అధ్యక్షుడు పిసరీ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు