BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
14 Apr, 2026 - 04:12 PM
61 వీక్షణలు

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు: మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి

​భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ మరువద్దని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి-నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందన్నారు. నవ భారత నిర్మాతగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు అవునూరి లచ్చన్న, జిల్లా నాయకులు శనిగారపు లింగన్న, మండల అధ్యక్షులు రాందాస్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు