BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అంబేద్కర్ ఫోటో సాక్షిగా మహిళా కోర్టు పీపీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:45 PM
80 వీక్షణలు

బెంగుళూరులో అవినీతి నిరోధక అధికారుల వలలో మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కుకున్నారు. బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న సవిత నవీన్ పాటిల్ ఓ కేసుకు సంబంధించి రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో నిర్వహించిన దాడిలో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును దాచిపెట్టిన వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి సాక్ష్యాలతో సహా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో కింద కూర్చునే సమయంలోనే అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా లంచం వ్యవహారం బయటపడటంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.