BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

అంబేద్కర్ ఫోటో సాక్షిగా మహిళా కోర్టు పీపీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:45 PM
33 వీక్షణలు

బెంగుళూరులో అవినీతి నిరోధక అధికారుల వలలో మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కుకున్నారు. బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న సవిత నవీన్ పాటిల్ ఓ కేసుకు సంబంధించి రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో నిర్వహించిన దాడిలో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును దాచిపెట్టిన వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి సాక్ష్యాలతో సహా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో కింద కూర్చునే సమయంలోనే అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా లంచం వ్యవహారం బయటపడటంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.