BREAKING
పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్!
www.ntodaynews.com

అంబేద్కర్ ఫోటో సాక్షిగా మహిళా కోర్టు పీపీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:45 PM
13 వీక్షణలు

బెంగుళూరులో అవినీతి నిరోధక అధికారుల వలలో మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కుకున్నారు. బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న సవిత నవీన్ పాటిల్ ఓ కేసుకు సంబంధించి రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో నిర్వహించిన దాడిలో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును దాచిపెట్టిన వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి సాక్ష్యాలతో సహా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో కింద కూర్చునే సమయంలోనే అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా లంచం వ్యవహారం బయటపడటంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.