BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబేద్కర్ ఫోటో సాక్షిగా మహిళా కోర్టు పీపీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:45 PM
112 వీక్షణలు

బెంగుళూరులో అవినీతి నిరోధక అధికారుల వలలో మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కుకున్నారు. బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న సవిత నవీన్ పాటిల్ ఓ కేసుకు సంబంధించి రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో నిర్వహించిన దాడిలో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును దాచిపెట్టిన వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి సాక్ష్యాలతో సహా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో కింద కూర్చునే సమయంలోనే అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా లంచం వ్యవహారం బయటపడటంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.