అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి
మునిపంపుల అంగన్ వాడి క్లస్టర్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ దివాస్
గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం
యాదాద్రి జిల్లా :- పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందిస్తేనే శక్తివంతంగా తయారవుతారని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల అంగన్వాడి సెక్టార్ పరిధిలో పోషణ పక్వాడ దివాస్ సందర్భంగా పిల్లలు, గర్భిణీలు బాలింతలకు ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదు అని మన గ్రామాల్లో లభించే పప్పులు Zకూరగాయలు, పండ్లు, పాలు, ఆకు కూరలు వంటి పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించొద్దని గ్రామంలో ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. అంగన్వాడి టీచర్లు స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు గ్రామ ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, అంగన్వాడీ టీచర్లు బద్రుని సాబేగం,బాదె మంజుల, యాదాసు శోభ, ఏలూరు అనిత, ఆశా వర్కర్లు మామిండ్ల లక్ష్మి, గాదె అలివేలు, ఏఎన్ఎం కార్యకర్తలు, మునిపంపుల సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, బాలింతలు,గర్భిణీ స్త్రీలు,, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.