BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 07:22 PM
114 వీక్షణలు

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్ ; ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గంలోని రైతులు తాము పండించిన ప్రతి గింజను అమ్ముకునేలా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని, అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాల పట్టణంతో పాటు  వట్టిమర్తి, వనిపాకల, ఆరెగూడెం, పెద్దకాపర్తి, వెలిమినేడు, సుంకెనపల్లి, గుండ్రంపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు కుటుంబం నుండి వచ్చిన వారు కావడం వల్ల సాగు కష్టాలు ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసినప్పటికీ, రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాలని  పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. అంతేకాకుండా రైతులకు ధాన్యానికి బోనస్ అందించడంతో పాటు, రుణమాఫీ,రైతు భరోసా,  వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు.  మద్దతు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సునీత యాదయ్య, ఆవుల సుందర్, బొంతల చంద్రారెడ్డిలతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.