BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 07:22 PM
80 వీక్షణలు

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్ ; ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గంలోని రైతులు తాము పండించిన ప్రతి గింజను అమ్ముకునేలా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని, అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాల పట్టణంతో పాటు  వట్టిమర్తి, వనిపాకల, ఆరెగూడెం, పెద్దకాపర్తి, వెలిమినేడు, సుంకెనపల్లి, గుండ్రంపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు కుటుంబం నుండి వచ్చిన వారు కావడం వల్ల సాగు కష్టాలు ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసినప్పటికీ, రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాలని  పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. అంతేకాకుండా రైతులకు ధాన్యానికి బోనస్ అందించడంతో పాటు, రుణమాఫీ,రైతు భరోసా,  వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు.  మద్దతు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సునీత యాదయ్య, ఆవుల సుందర్, బొంతల చంద్రారెడ్డిలతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.